Kallakurichi Illicit Liquor: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కల్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి తొమ్మిది మంది మృతి చెందారు. వివిధ ఆసుపత్రుల్లో సారా తాగి అస్వస్థతకు గురైన మరో 40 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు సారా కేంద్రం వల్ల ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో సారా దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారు.
తమిళనాడులో మరో సారి కల్తీ సారా కలకలం రేపింది. కల్లకురిచిలో కల్తీ సారా తాగి తొమ్మిది మంది మృతి చెందగా మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానిక మెడికల్ కాలేజీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. గ్రామస్థులు కల్తీ సారా విక్రయాలపై ఆందోళనకు దిగారు. అంతే కాకుండా కల్తీసారా అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో స్థానిక అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కల్లీ సారా ఎక్కడ నుంచి వచ్చింది అనే దానిపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలని స్థానిక కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.