Big Stories

7 New Born Babies Died: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువులు దుర్మరణం!

7 New Born Babies Died in New Delhi: తూర్పు ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వివేక్ విహార్ లో ఉన్న శిశు సంరక్షణ ఆస్పత్రిలో మంటలు చెలరేగడంతో.. ఆస్పత్రిలో ఉన్న నవజాత శిశువులు మరణించారు. ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు శిశువులకు గాయాలయ్యాయి. వారందరికీ ప్రస్తుతం చికిత్స చేస్తున్నారు. కొందరు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం అర్థరాత్రి సమయంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఆస్పత్రిలో మంటలు చెలరేగగానే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపుచేశారు. కాగా.. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదంలో నవజాత శిశువులు దుర్మరణం చెందడం యావత్ దేశాన్ని కలచివేసింది.

- Advertisement -

Also Read: 24 మంది సజీవదహనం.. ఇంకా ఎగిసిపడుతున్న మంటలు – వీడియో

ఢిల్లీలోనే మరో ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం అర్థరాత్రి ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఒక నివాస భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేసి.. 13 మందిని రక్షించారు. నిన్న గుజరాత్ లోని రాజ్ కేట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News