Taiwan:-డిఫెన్స్లో ఏరియల్ వెహికల్స్ ఎంత ముఖ్యమో ప్రభుత్వాలు ఆలోచించడం మొదలుపెట్టాయి. వీటిలో ముఖ్యంగా డ్రోన్ల వినియోగం ప్రపంచ దేశాల డిఫెన్స్ సిస్టమ్స్లో కీలకంగా మారాయి. డ్రోన్లతో పాటు మరెన్నో అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసిన ఏరియల్ వెహికల్స్ను కూడా రంగంలోకి దించాలని పలు దేశాలు సన్నాహాలు మొదలుపెట్టాయి. తాజాగా తైవాన్ కూడా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా చైనానే తైవాన్ టార్గెట్ అని తెలుస్తోంది.
ఉక్రెయిన్, రష్యా మధ్య అనూహ్య యుద్ధం తలెత్తినా కూడా అమెరికా.. తమ దగ్గర ఉన్న టెక్నాలజీలతో అప్పటికప్పుడు ఎన్నో కొత్త యుద్ధ పరికరాలను యుద్ధభూమిలోకి దింపింది. అందుకే ఆ టెక్నాలజీని కాపీ కొట్టి తైవాన్ కూడా కొత్త పరికరాన్ని తయారు చేసింది. అదే పోర్టెబుల్ డ్రోన్. అంటే మనిషి సాయం లేకుండా ఆకాశంలోకి ఎగురుతూ సైనికులకు సాయం చేసే డ్రోన్. తాజాగా ఈ డ్రోన్ లాంచ్ జరిగింది. చైనా.. తమ దేశంపై దృష్టి సారించిన సందర్భంగా తైవాన్ ఈ ముందు జాగ్రత్త చర్యలు చేస్తుందని తెలుస్తోంది.
తైవాన్లో ఉండే జనాభా 23.5 మిలియన్. కానీ ఆ దేశ ప్రజలందరూ చైనా ఎప్పుడెప్పుడు తమపై దండయాత్రకు వస్తుందో అని భయంతో బతుకుతుంటారు. అందుకే తైవాన్.. తమ డిఫెన్స్ను బలంగా మార్చుకోవాలనుకుంటోంది. గత కొన్నేళ్లుగా బీజింగ్.. తైవాన్ను ఆక్రమించుకోవాలనే ఆలోచనలో ఉందని తైవాన్కు తెలుసు. అంతే కాకుండా తాజాగా రష్యా.. ఎలా అయితే ఉక్రెయిన్కు ఆక్రమించుకోవడానికి యుద్ధం ప్రకటించిందో.. అలాగే చైనా కూడా చేస్తుందేమో అన్న భయం తైవాన్లో ఎక్కువయ్యింది. అందుకే ఈ డ్రోన్ ఐడియాతో ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.
ఏఐతో థెరపీ.. మెంటల్ హెల్త్పై ప్రభావం..
for more updates follow this link:-bigtv