Salakatla Teppotsavam:సూర్యజయంతి నాడు గడప దాటని గోవిందుడు… తెప్పోత్సవాలతో కనువిందు చేయనున్నాడు. శ్రీనివాసుడు అలంకార ప్రియుడు., ఉత్సవ ప్రియుడు కాబట్టే… ప్రతి నిత్యం ఏదొక ఉత్సవం ఆలయంలో జరుగుతూనే ఉంటుంది. వేసవి కాలం ప్రారంభంలో ప్రతి ఏటా స్వామి వారికి తెపోత్సవాలను ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమివనున్నారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనం ఇస్తారు.
రెండో రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో , 5,6 వ తేదీన శ్రీభూ సమేతంగా మలయప్పస్వామి ఐదుసార్లు పుష్కరిణిలో తిరిగి దర్శనం ఇస్తారు. చివరి రోజు మార్చి 7న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో దర్శనం ఇస్తారని వివరించారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి ఆలయానికి ఈశాన్య ప్రాంతంలో వున్న పుష్కరిణిలో శ్రీవారి తెపోత్సవాలు జరుగుతాయి. 15వ శతాబ్దంలో సాళువ నరసింహరాయులు స్వామి వారి పుష్కరణిలో నిరాళి మండపాన్ని నిర్మించాడు. తెప్పోత్సవాల్లో మలయప్ప స్వామి ఐదు రోజుల పాటు మండపం చుట్టు ప్రదక్షణలుగా తెప్పలో విహరిస్తారు.
Kedarnath Temple:ఏప్రిల్ లో తెరుచుకోనున్న కేథార్ నాథ్ తలుపులు