India and Germany:సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాలు ఎంత పోటీపడినా.. కొన్నిసార్లు అవి కలిసి పనిచేయకపోతే అభివృద్ధి అనేది పూర్తిస్థాయిలో రాదు. అది గుర్తిస్తున్న కొన్ని దేశాలు సైన్స్ అండ్ టెక్నాలజీని మెరుగుపరచడానికి ఇతర దేశాలతో చేతులు కలుపుతున్నాయి. ఇప్పటికే అమెరికా.. ఇండితో చేతులు కలిపింది. తాజాగా మరో దేశం కూడా ఇండియాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది.
ఇటీవల జెర్మన్ ఛాన్సిలర్ ఒలాఫ్ స్కాల్జ్.. ఇండియాలో పర్యటించారు. అదే సమయంలో ఇండియా, జెర్మనీ మధ్య పలు కీలక ఒప్పందాలను కూడా చేశారు. ఇండియా, జెర్మనీ కలిసి కొత్త టెక్నాలజీలను ఏర్పాటు చేసే విషయంలో ముందుకెళ్లాలని ఢిల్లీ, బెర్లీన్ కలిసి ఒక జాయింట్ విజన్ను విడుదల చేసింది. ఇది ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరచనుంది. ఈ జాయింట్ విజన్లో సంబంధాలను బలపరచడంతో పాటు మరికొన్ని విషయాలు కూడా పొందుపరిచారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6జీ సర్వీసులు వంటి విషయాల్లో ఇకపై ఇండియా, జెర్మనీ కలిసి పనిచేయనున్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాలు విడివిడిగా ఎంతో అభివృద్ధిని సాధించాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన ఒప్పందం.. వారికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి జరిగేలా చేయడాలని ఇరుదేశాల ఉన్నతాధికారులు కోరుకుంటున్నారు. అయినా ఇండియా, జెర్మనీ.. టెక్నాలజీ విషయంలో ఒప్పందాలు చేసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదు.
1974 మేలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి విషయంలో ఇండియా, జెర్మనీ కలిసి పనిచేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం అప్పట్లో ఇరుదేశాలకు మంచి చేసింది. అంతే కాకుండా పరిశ్రమల విషయంలో కూడా రెండు దేశాలు అభివృద్ధి సాధించే విధంగా తోడ్పడింది. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి జరిగిన ఒప్పందంలో ఇండియా, జెర్మనీకి సంబంధించిన పలు విశ్వవిద్యాలయాలు కూడా కలిసి పనిచేయాలని వారు నిర్ణయించుకున్నారు.
Covid Vaccine:గుండె సంబంధిత వ్యాధులపై కోవిడ్ వ్యాక్సిన్ ఎఫెక్ట్..
Earth Consists: భూమిలోపల మరో కొత్త లేయర్.. కనిపెట్టిన శాస్త్రవేత్తలు..