Amavasya after 30 years:- హిందూమతంలో ప్రతి తిథికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో అమావాస్య తిథి మరింత ప్రాధాన్యం ఉంది.హిందూ పంచాంగం ప్రకారం, 21 జనవరి 2023న అమావాస్య వచ్చింది. శనివారం రోజున ఉదయం 6:17 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే 22 జనవరి 2023న ఆదివారం అర్ధరాత్రి 2:22 గంటల వరకు ఉంటుంది.
ఈ అమవాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు. ఆంగ్ల నూతన సంవత్సరంలో తొలిసారిగా వచ్చే ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య శనివారం రోజున రావడంతో దీన్ని శనిశ్చరి అమావాస్య అని పిలుస్తారు. ఇలా శనివారం నాడు అమావాస్య వస్తే శనిశ్చరి అమావాస్య అంటారు. ఇలా జరగడం దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇదే. అందువల్ల ఈ అమావాస్యను శుభప్రదంగా భావిస్తారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మాఘ మాసంలో సూర్యుడు, శని, శుక్రుడు మూడు ప్రధాన గ్రహాలు కలిసి కుంభరాశిలోనే కలయిక ఉండబోతోంది. ఈ సమయంలో త్రిగ్రాహి సంయోగం ఏర్పడబోతోంది..
ఇదే రోజున పుర్వ ఆషాఢ, ఉత్తర ఆషాఢ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. వీటితో పాటు హర్ష యోగం, చతుష్పాద కరణ యోగాలు కూడా అమావాస్య తిథిలో ఏర్పడనున్నాయి. ఈ కాలంలో శని దేవుడు మకరం నుంచి కుంభ రాశిలోకి సంచారం చేస్తాడు.
శనివారం నాడు శనిదేవుడికి ప్రత్యేక పూజలు చేస్తే దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. శనిదేవుడి ఆలయానికి వెళ్లి ఆవనూనె దీపం వెలిగించి తిరిగి వచ్చేటప్పుడు శనిదేవుడికి మీ వీపు చూపకుండా ఇంటికి చేరుకోవాలి. వీపు చూపిస్తే అశుభంగా భావిస్తారు. ఆపదలో ఉన్న వ్యక్తికి కానీ, నిస్సహాయుడైన వ్యక్తికి శని అమావాస్య నాడు సహాయం కోరితే.. వెంటనే చేస్తే శనిదేవుడు సంతోషిస్తాడు.
Follow this link for more updates:- Bigtv