jobs: ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎంతో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. వందల్లో ఖాళీలు.. లక్షల్లో అభ్యర్థులు. జాబ్ కొట్టాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. మెరిట్ ఉండాలి. పరీక్ష పాసవ్వాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. అయితే, ఇలాంటి తతంగమేమీ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. జస్ట్ పదో తరగతి పాస్ అయితే చాలు. మెరిట్ ఉంటే జాబ్ వచ్చినట్టే. అంతే. ఇంతే సింపుల్.
తపాలా శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 12,828 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీలు భర్తీ చేయనున్నారు. టెన్త్ మార్క్స్లో మెరిట్తో నియామకాలు చేపట్టనున్నారు. సెలెక్ట్ అయితే, బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
–మొత్తం పోస్టులు 12,828. ఏపీలో 118, తెలంగాణలో 96 ఖాళీలు.
–పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.
–ఏపీ, తెలంగాణ అభ్యర్థులు టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి.
–కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైకిల్ తొక్కటం రావాలి.
–జూన్ 11 నాటికి 18-40 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు.
–బీపీఎం పోస్టులకు నెలకు 12,000-29,380 జీతం, ఏబీపీఎం పోస్టులకు 10,000-24,470 వేతనం.
–మే 22 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తు గడువు.
— https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.