Big Stories

Pakistan: పెషావర్‌లో ఆత్మాహుతి దాడి.. 100కు చేరిన మృతుల సంఖ్య

Pakistan: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈఘటనలో మృతుల సంఖ్య 100కి చేరుకుంది. శిథిలాల తొలగింపు కొనసాగుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 200 మందికి పైగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్న ఉగ్రవాది మొహ్మద్ జిల్లాకు చెందిన మొహ్మద్ అయాజ్‌(37)గా అధికారులు గుర్తించారు. శిథిలాల కింద అతడి తలభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే నాలుగు అంచెల భద్రతా వలయాన్ని దాటుకొని అతడు మసీదులోకి ఎలా చేరుకున్నాడనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

అయాజ్ ప్రభుత్వ వాహనంలోనే మసీదుకు చేరుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి 10 నుంచి 12 కిలోల పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు గుర్తించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News