Indian Dies in Italy: ఇటలీలో దారుణం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం ఇటలీకి వెళ్లిన ఓ భారతీయుడు దారుణంగా ప్రాణాలు కోల్పోయాడు. సకాలంలో ట్రీట్మెంట్ చేయకపోవడంతో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో అక్కడి ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇంకా లోతుల్లోకి వెళ్తే…
భారత్కు చెందిన 30 సత్నామ్సింగ్ పొట్ట కూటి కోసం ఇటలీ వెళ్లాడు. అయితే అధికారిక ద్రువ పత్రాలు లేకపోవడంతో ఇటలీలోని లాటినాలో ఉంటున్నాడు. భారత్ నుంచి వలస వచ్చినవారు ఎంతోమంది ఈ ప్రాంతంలో ఉంటారు. అక్కడి వ్యవసాయ క్షేత్రంలో సత్నామ్ పని చేస్తున్నాడు. అయితే రెండురోజుల కిందట ఎండిపోయిన గడ్డిని కత్తిరించే పనిలోపడ్డాడు.
ఈ క్రమంలో అతడి చేయి తెగిపోయింది. ఈ ఘటనపై స్థానిక సిబ్బంది పట్టించుకోలేదు. రోడ్డు పక్కన ఓ దగ్గర పడివున్నాడు. బాధితుడి భార్య, ఫ్రెండ్స్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ బుధవారం ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై అక్కడ రాజకీయ రచ్చ మొదలైంది. ఇది అత్యంత క్రూరమైన చర్యగా పేర్కొన్నారు ఇటలీ కార్మిక మంత్రి. దీనిపై విచారణ చేయించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. అక్కడి విపక్షాలు సైతం ఆ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటలీలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి కుటుంబానికి సహకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.