Double ISMART SteppaMaar song(Telugu film news): డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక మాస్ యాక్షన్ కంటెంట్తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ముఖ్యంగా ఇందులో రామ్ పోతినేని మాస్ లుక్, అండ్ లాంగ్వేజ్కి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా సాంగ్స్కి బాగా అట్రాక్ట్ అయ్యారు.
బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ గ్రాండ్ లెవెల్లో రూపొందిస్తున్నాడు. ఇందులో కూడా రామ్ తన మాస్ లుక్ను కంటిన్యూ చేయబోతున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఈ సారి బడా స్టార్ను తీసుకువస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ‘కేజీఎఫ్’ విలన్ సంజయ్ దత్ ఈ సినిమా హీరో రామ్ను ఢీ కొట్టే పాత్ర చేస్తున్నాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే విలన్ పాత్ర పోషిస్తున్నాడు.
ఈ సినిమాపై అటు సిని ప్రేక్షకుల్లోనూ ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అయింది. మేకర్స్ కూడా మ్యూజికల్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేసేశారు.
Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ బర్త్ డే ట్రీట్.. అదరహో అనిపించిన రామ్ పోతినేని!
ఇందులో భాగంగానే డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి ‘స్టెప్ప మార్’ అనే ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు ప్రోమోను కూడా రిలీజ్ చేసి అందరిలోనూ ఉత్కంఠ రేపారు. అదే క్రమంలో ఈ స్టెప్ప మార్ ఫుల్ సాంగ్ను తాజాగా రిలీజ్ చేసి సినీ ప్రియులకు, అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ ఫుల్ మాస్ లిరిక్స్, మాస్ డాన్స్ స్టెప్పులతో అదిరిపోయింది. ఈ సాంగ్కు మణిశర్మ మాస్ బీట్స్ అందించగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాస్ స్టెప్పులతో అదరగొట్టించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో దుమ్ము దులిపేస్తుంది. కాగా ఇందులో రామ్ పోతినేనికి జోడీగా యంగ్ బ్యూటీ కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ అండ్ నటి ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు రానున్నాయి.