Salaar:స్టార్ హీరోయిన్ శ్రుతీ హాసన్కి ఈ ఏడాది ఓ రేంజ్లో కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంక్రాంతికి విడుదలైన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చిత్రాల్లో ఆమె హీరోయిన్గా అలరించిన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబర్ 28న ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’లో నటించింది. ఆమె పాత్ర పేరు ఆద్య. తన రోల్కి సంబంధించి షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో శ్రుతీహాసన్ సెట్స్లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్, ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కోసం ప్రభాస్ వెయిట్ చేస్తున్నారు. ఆయనతో ప్రశాంత్ నీల్ వంటి దర్శకుడు ఓ మాస్ కమర్షియల్ మూవీ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాలు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయనటంలో సందేహం లేదు.
రెండు, మూడు పోస్టర్స్ మినహా ఈ సినిమా నుంచి మరే అప్డేట్స్ లేవు. టీజర్, గ్లింప్స్ వంటివి రిలీజైతే మూవీ ఎలా ఉంటుందనేది ఓ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. వాటి కోసమే అందరూ ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. హోంబలే ఫిలింస్ .. సలార్ సినిమాను భారీ రేంజ్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, టాలీవుడ్ సీనియర్ స్టార్ జగపతి బాబు ఇందులో విలన్స్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
Vishal: ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న విశాల్
Ram Charan: రామ్చరణ్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. రీరిలీజ్కు రెడీ అవుతున్న ‘మగధీర’..