Big Stories

SDT18: హనుమాన్ నిర్మాతలతో మెగా మేనల్లుడు.. ఇక అధికారికం

SDT18: విరూపాక్ష సినిమా తరువాత మెగా మేనల్లుడు మళ్లీ బ్రో సినిమాతో వెండితెరపై కనిపించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక మధ్యలో సత్య అనే ఒక ఆల్బమ్ లో కనిపించిన తేజ్.. ఆ తరువాత ఎక్కువ పవన్ పక్కనే కనిపించాడు. జనసేన తరుపున ప్రచార చేసి ఎట్టకేలకు మామయ్యను దగ్గరుండి గెలిపించాడు. ఇక ఆయన విజయాన్ని తన విజయంగా మార్చుకొని సంబురాలు చేసుకున్నాడు.

- Advertisement -

ఇక బ్రో తరువాత తేజ్.. సంపత్ నందితో గాంజా శంకర్ సినిమాను ప్రకటించాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఇకపోతే గత కొన్నిరోజులుగా తేజ్.. కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్నాడని, దానికి హనుమాన్ సినిమా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అని టాక్ నడుస్తున్న నేపథ్యంలో తేజ్.. తన సినిమాను అధికారికంగా ప్రకటించాడు.

- Advertisement -

రోహిత్ కేపీ అనే దర్శకుడును పరిచయం చేస్తూ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హనుమాన్ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని తేజ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ” నా తదుపరి చిత్రం SDT18. ఇది ప్రత్యేకంగా ఉంటుంది. మీ అందరి ప్రేమ & ఆశీస్సులు కావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒక పోస్టర్ ను కూడా అభిమానులతో పంచుకున్నాడు.

ఆ పోస్టర్ లో చుట్టూ ల్యాండ్ మైన్స్ ఉన్న ఎడారి ప్రాంతంలో ఒక చెట్టు పచ్చగా కనిపిస్తూ ఉంది. దీనంగా ఉన్న భూమి అతని రాక కోసం ఎదురుచూస్తుంది.. అతడు లోతుల నుంచి పైకి ఎక్కుతాడు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరి ఈ సినిమాతో తేజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News