RRR : దక్షిణాది సత్తాను పాన్ ఇండియా రేంజ్లో చాటిన చిత్రాల్లో RRR ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం రూ. 1200 కోట్ల రూపాయలను సాధించింది. జపాన్లో ఇప్పుడు వసూళ్ల రికార్డులను క్రియేట్ చేసేలా అడుగులు వేసింది. కాగా.. RRR రిలీజైన ప్రారంభంంలో దీనికి సీక్వెల్ చేసే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. అప్పట్లో ఆ వార్త బాగా ట్రెండింగ్ అయ్యింది. తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి RRR సీక్వెల్కి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అందుకు కారణం.. దర్శక ధీరుడు రాజమౌళి.
ప్రస్తుతం RRR మూవీని చికాగో ప్రత్యేకంగా పదర్శిస్తున్నారు. ఆ షోకి రాజమౌళి హాజరైనప్పుడు సీక్వెల్ గురించి ఓ ఆడియెన్ ప్రశ్నించాడు. దానికి రాజమౌళి మాట్లాడుతూ నేను ఈ విషయం గురించి ఇప్పుడే చెప్పలేను RRR 2కి సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. మా నాన్న, రైటర్ విజయేంద్ర ప్రసాద్తో చర్చలు జరుగుతున్నాయని అన్నారు. నిజంగానే RRR సీక్వెల్కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయా? లేక ప్రమోషన్స్లో భాగంగానే రాజమౌళి ఈ మాట అన్నారో తెలియటం లేదు. ఒకవేళ నిజంగానో చర్చలు సక్సెస్ అయ్యి.. మంచి కథ కుదిరితే .. మెగా, నందమూరి అభిమానులు, టాలీవుడ్ ప్రేక్షకులు మరోసారి పండుగ చేసుకుంటారనటంలో సందేహం లేదు.