Big Stories

Ridhi Dogra: బాలకృష్ణపై జవాన్ బ్యూటీ ఫైర్.. పనికిమాలిన పని చేసిన మగాడు..

Ridhi Dogra: నందమూరి బాలకృష్ణ చనువుగా చేసిన ఒక పని.. ట్రోల్స్ బారిన పడిన విషయం తెల్సిందే. విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

- Advertisement -

ఈవెంట్ లో బాలయ్య మందు కొట్టడం.. ఆ బాటిల్స్ బయటపడ్డాయి. అంతేకాకుండా హీరోయిన్ అంజలిని తోయడం జరిగింది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. తాగిన మత్తులో బాలయ్య.. ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా వివరణ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ.. అది మందు కాదు సీజీ వర్క్ చేసారని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

అంజలి చనువు కొద్దీ బాలయ్య తోశాడని చెప్పుకొచ్చింది. అయినా కూడా బాలయ్య ప్రవర్తన తెలిసిన వారెవ్వరూ కూడా వాటిని నమ్మలేదు. సరే ఈ గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది అనుకుంటున్న సమయంలో.. బాలీవుడ్ భామ రిద్ధి డోగ్రా మరోసారి బయటకు తీసింది.

తాజాగా ఆమె ఈ వీడియోను షేర్ చేస్తూ.. బాలకృష్ణపై విరుచుకుపడింది. మగాళ్లు అంతా అంతే అంటూ తన కోపాన్ని చూపించింది. ” అతను.. ఆ మహిళను కించపరుస్తున్నా.. ఆమె నవ్వుతూనే ఉంది. ఎందుకంటే పేరు, డబ్బు ఉన్న మగాళ్లు ఏ పనికిమాలిన పని చేసినా ఈ లోకం తప్పు పట్టదు. ఎందుకంటే.. వారు ఏ తప్పు చేసినా పర్వాలేదు అనే స్థాయికి తీసుకొచ్చారు. ఒకవేళ అదే పని.. ఆ మహిళ చేసి ఉంటే.. ఇప్పటికే ఆమె ట్రోలింగ్ కు గురయ్యేది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక రిద్ది మాటలను చాలామంది సమర్థిస్తున్నారు. నిజమే.. మగాళ్లు అనే పొగరుతో ఏదైనా చేస్తారా అని కామెంట్స్ చేస్తున్నారు. రిద్ధి డోగ్రా.. టీవీ సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించింది. వో అప్నా సా, అసూర్‌, ది మ్యారీడ్ వుమన్‌, మర్యాద: లేకిన్ కబ్ తక్‌ లాంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ను పెంచే కానిస్టేబుల్ గా ఆమె నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత రిద్ధికి మంచి గుర్తింపు వచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News