Prabhas new record : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ అక్కడ నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. ప్రభాస్ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటివారు పాన్ ఇండియా రేంజ్లో ఇమేజ్సంపాదించుకున్నారు. నిఖిల్ కూడా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎంత మంది హీరోలున్నా ఎవరికీ సాధ్యం కానీ ఓ మైల్స్టోన్ను మాత్రం ప్రభాస్ సొంతం చేసున్నాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఇది నిజంగా ప్రభాస్కి ఫ్యాన్స్కి కిక్ ఇచ్చే విషయమే. ఇంతకీ ప్రభాస్ సాధించిన ఆ మైల్స్టోన్ ఏంటా? అని ఆలోచిస్తున్నారా?
అసలు విషయంలోకి వెళితే.. పాన్ ఇండియా హీరోలు ఎవరు ఇప్పటి వరకు ఏడాది గ్యాప్లో మూడు భారీ చిత్రాలను రిలీజ్ చేయలేదు. కానీ ప్రభాస్ మాత్రమే ఆ పని చేస్తున్నారు. డీటెయిల్స్ చూస్తే.. ప్రభాస్ ఇప్పుడు ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ K, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అన్నీ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. ఈ నాలుగింటిలో మూడు సినిమాలకు రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అందులో ముందుగా ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28న సలార్ మూవీ రిలీజ్కి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న ప్రాజెక్ట్ K రిలీజ్ కానుంది.
ఇప్పటి వరకు అయితే ప్రభాస్ హీరోగా చేసిన మూడు పాన్ ఇండియా సినిమాలకు సంబంధించిన మూవీస్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ అయ్యాయి. అన్నీ కుదిరితే డార్లింగ్తో మారుతి చేస్తున్న మూవీకి సంబంధించిన విడుదల తేది కూడా ఫిక్స్ అవుతుంది. అంతా సవ్యంగా సాగితే ఈ లిస్టులో మరో సినిమా చేరుతుంది. అంటే ఏడాదిలో నాలుగు సినిమాలు .. అవి కూడా పాన్ ఇండియా సినిమాలను రిలీజ్ చేసే క్రెడిట్ ప్రభాస్కి మాత్రమే సాధ్యమవుతుంది.
Prabhas : పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ.. ఎప్పుడంటే..?