Prabhas latest News(Celebrity news today) :టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన మ్యారేజ్ పై క్లూ ఇచ్చాడు. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయంపై స్పందించాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ప్రభాస్ మాట్లాడుతున్న సమయంలో పెళ్లెప్పుడు అని అభిమానులు అడిగారు. తిరుపతిలోనే ఎప్పుడైనా చేసుకుంటానని ప్రభాస్ చిరునవ్వులు చిందిస్తూ సమాధానం ఇచ్చాడు.
ఇకపై ఏడాదికి 2 సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని డార్లింగ్ చెప్పాడు. కుదిరితే 3 సినిమాలు కూడా చేస్తానన్నాడు. 7 నెలల క్రితం 3డీలో ఆదిపురుష్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఫ్యాన్స్ ఇచ్చిన ధైర్యంతోనే టీమ్ మరింత కష్టపడి పనిచేసిందన్నాడు. రోజుకు రెండు, మూడు గంటలే నిద్రపోయిన సందర్భాలూ ఉన్నాయని తెలిపాడు. ఆదిపురుష్ లాంటి సినిమా చేయడం తన అదృష్టంగా పేర్కొన్నాడు. రామాయణం చేయాలంటే కష్టపడాల్సి వస్తుందని అంటారని.. అలాంటి కష్టాలు తమకు ఎదురయ్యాయని ప్రభాస్ ఈ సినిమా అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
ఆది పురుష్ మూవీని డైరెక్టర్ ఓం రౌత్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించాడు. కృతిసనన్ సీత పాత్రలో నటించింది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి పాల్గొన్నారు.