Big Stories

Rakshana oTT: ఓటీటీలోకి పాయల్ క్రైమ్ మూవీ ‘రక్షణ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Rakshana oTT: పాయల్ రాజ్ పుత్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎవరూ ఊహించని రెస్పాన్స్‌తో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో పాయల్ పేరు మారుమోగిపోయింది. తొలి మూవీతోనే రొమాంటిక్ సీన్లతో సినీ ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపింది.

- Advertisement -

ఈ మూవీతో పాయల్ రాజ్ పుత్‌కి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. వరుస పెట్టి సినిమాలతో ఆ మధ్య ఫుల్ బిజీ బిజీ అయిపోయింది. కానీ ఆర్ ఎక్స్ 100 తర్వాత చేసిన సినిమాలేవి ఆమెకు పెద్దగా అచ్చిరాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆమె చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా విజయపజయాలతో సంబంధం లేకుండా పలు సినిమాలతో దూసుకుపోయింది.

- Advertisement -

Also Read: నేనేం వదిలేయలేదు మీ దేవుడిని.. టార్చర్ చేయోద్దు.. మరోసారి బాంబ్ పేల్చిన రేణు

అయితే పాయల్‌కు ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సినిమా ఏదన్నా ఉందంటే అది మంగళవారం సినిమా మాత్రమే. ఈ చిత్రాన్ని కూడా ఆర్‌ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించి పాయల్‌కు మరో హిట్ అందించాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన మంగళవారం మూవీ సినీ ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసింది.

ఇక ఈ మూవీ తర్వాత పాయల్ తాజాగా మరో సినిమా చేసింది. ఈ సారి రొమాంటిక్ జోనర్‌లకు పోకుండా పోలీస్ ఆఫీసర్‌గా ‘రక్షణ’ అనే తీసింది. ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌కు క్రేజీ అనుభూతిని అందించింది. ఇక ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం జూన్ 21 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News