Big Stories

Pawan Kalyan Movie Update: పవన్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఆ సినిమాలపై క్రేజీ అప్డేట్!

Pawan Kalyan Movie HariHara Veeramallu Update: పవర్ స్టార్ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పవన్ కల్యాణ్..ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమితో కలిసి అఖండ విజయం సాధించింది. దీంతో పవన్ కల్యాణ్ పలు కీలక బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరుణంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తారా.. చేయరా అనే చర్చ సినీ పరిశ్రమలో జోరుగా సాగుతోంది.

- Advertisement -

పవన్ కల్యాణ్ శనివారం తెలంగాణలోని జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, జులై 1 నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రజా సేవలో బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన నటిస్తున్న సినిమాలపై మేకర్స్ అప్డేట్ ప్రకటించారు.

- Advertisement -

పవన్ కల్యాణ్ గతంలో సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఎన్నికలకు ముందు సినిమాలకు చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు ప్రారంభించిన సినిమాల్లో ‘హరహర వీరమల్లు’ ఒకటి. ఈ మూవీ అనౌన్స్ చేసి ఏళ్లు గడుస్తున్నా..ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఎట్టకేలకు ఈ సినిమాపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పారు.

‘హరహర వీరమల్లు’ మూవీ నిర్మాత ఎ.ఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘హరహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్ షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఇంకో 20 నుంచి 25 రోజులు ఆయన షూటింగ్ చేస్తే మూవీ పూర్తవుతోంది. ప్రజా సేవలో బిజీగా ఉండడంతో ఆయన వీలును బట్టి త్వరలోనే పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ‘హరహర వీరమల్లు’ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుంది. వారి అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కావాలి. కానీ వాళ్లను రిక్వెస్ట్ చేసి విడుదల తేదీని కాస్త వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని.’ నిర్మాత చెప్పారు.

Also Read: రెండు జడలు వేసుకొని హొయలు పోతున్న ఈ అక్కాచెలెళ్లు.. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు.. ఎవరో గుర్తుపట్టండి

అదే విధంగా ఈ ఏడాదిలోనే సినిమాను ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని, డిసెంబర్‌లో విడుదల చేసే విధంగా చూస్తామని నిర్మాత చెప్పారు. అయితే ఈ మూవీకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఇప్పుడు ఆయన బిజీ ఉండడంతో క్రిష్ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నారు. మెగా సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News