Nikhil Siddhartha: కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్లో మంచి సక్సెస్ను సొంతం చేసుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఎవరూ ఊహించని విజయమనే చెప్పాలి. కార్తికేయ 2 నుంచి అనుకోకుండా నిఖిల్ గ్రాఫ్ కూడా మారిపోయింది. మరి ఇకపై పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తారా? అని రీసెంట్గా అడిగిన ప్రశ్నకు నిఖిల్ చక్కటి సమాధానాన్ని ఇచ్చారు.
‘‘కార్తికేయ 2 విజయం తర్వాత నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. టాలీవుడ్లోనే ఉన్నాను. కార్తికేయ 2తో నేను పాన్ ఇండియా హీరో అయ్యానని చెప్పటం లేదు. కార్తికేయ 2 పాన్ ఇండియా కాన్సెప్ట్తో రూపొందిన సినిమా కావటంతోనే అంత పెద్ద విజయాన్ని సాధించింది. అంత మొత్తంలో కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు నేను చేసిన 18 పేజీస్ ఒక లవ్స్టోరి.. స్పై మూవీ ఓ యాక్షన్ థ్రిల్లర్. ఇక్కడి నుంచి నేను చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా కాన్సెప్ట్తో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను’’ అన్ని అన్నారు నిఖిల్.
కార్తికేయ 2లో నటించిన నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజీస్ డిసెంబర్ 23న రిలీజ్ అవుతుంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.