Big Stories

Bengaluru Drugs Case : బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. విచారణకు హాజరైన హేమ

Actress Hema Attended to CCB Police Enquiry : బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో విచారణ హాజరు కావాలని సీసీబీ పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. మొదటిసారి తనకు వైరల్ ఫీవర్ అని సాకు చెప్పిన హేమ.. రెండోసారి నోటీసులపై స్పందించలేదు. దీంతో హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు. థర్డ్ టైమ్ హేమ సీసీబీ పోలీసుల విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత హేమను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

మే 20న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో హేమ అడ్డంగా బుక్కైంది. నార్కోటిక్స్ టెస్ట్ లో ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్ పాజిటివ్ వచ్చింది. జీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి వెళ్లిన హేమ.. తనపేరును పోలీసులకు కృష్ణవేణిగా చెప్పింది. దాంతో పోలీసులు ఆమె పేరును అలాగే నమోదు చేసుకున్నారు. స్పాట్ నుంచి హేమ ఫోటో రిలీజ్ చేయడంతో హేమ ఆ పార్టీకి వెళ్లినట్లు కన్ఫర్మ్ అయింది. అదేరోజున హైదరాబాద్ కు వచ్చిన హేమ.. తాను ఇక్కడే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. రేవ్ పార్టీ జరిగిన చోటు నుంచే ఒక వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఆ తర్వాత దమ్ బిర్యానీ తో మరో వీడియో చేసింది.

- Advertisement -

Also Read : తప్పు చేయకుండా ఉండడానికి నేను ఏమి దేవుడిని కాదు.. మరో వీడియో వదిలిన హేమ!

తనకు ఆ పార్టీకి సంబంధం లేదని బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ వచ్చేంతవరకూ బుకాయించింది. ఆ తర్వాత సైలెంట్ అయింది. మీడియా తనపై బురద జల్లుతోందని వాపోయింది. ఒక స్టేజ్ లో MAA ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా హేమకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. విష్ణుపై సోషల్ మీడియా భగ్గుమంది. ఇలాంటి వాళ్లను ఎందుకు కాపాడాలని చూస్తున్నారంటూ నెటిజన్లు ఫైరయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News