Big Stories

Bollywood Heros: బాలీవుడ్ అగ్రహీరోలకు షాక్.. షోకాజ్ నోటీసులు పంపిన కేంద్రం

Bollywood Heros: బాలీవుడ్ అగ్రహీరోలైన షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ లకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. ఈ ముగ్గురికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గుట్కా సంబంధిత వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్నారంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసింది. బాలీవుడ్ హీరోలైన ఈ ముగ్గురూ కొన్ని హానికారక ఉత్పత్తులకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మోతీలాల్ యాదవ్ అనే లాయర్ గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

భారత ప్రభుత్వం నుంచి గౌరవనీయమైన పురస్కారాలు అందుకున్న షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్ వంటి అగ్రనటులు గుట్కా ను ప్రేరేపించే ప్రకటనల్లో పాల్గొనడం సరికాదని ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై విచారణ చేసిన అలహాబాద్ హైకోర్టు.. పిటిషనర్ చెప్పిన అభ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అప్పట్లో ఆదేశించింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.

- Advertisement -

పిటిషనర్ స్పందన కోరుతూ కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్ బీ పాండే శుక్రవారం కోర్టుకు సమాచారమిచ్చారు. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ కు అక్టోబర్ 22నే షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. అమితాబ్ బచ్చన్ ఈ తరహా ప్రకటనల నుంచి తప్పుకున్నా.. ఆయన ప్రకటనలను సదరు గుట్కా కంపెనీ ప్రసారం చేసిందని, దాంతో అమితాబ్ సదరు కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News