Naresh : సినీ నటుడు నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలోని ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు నరేష్ ఫిర్యాదు చేశారు. తన మూడో భార్య రమ్యా రఘుపతి ఈ దాడి చేయించిందని ఆరోపించారు. నరేష్ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు.
కొంతకాలంగా నరేష్ కు మూడో భార్య రమ్యా రఘుపతితో వివాదం నడుస్తోంది. నరేష్ .. పవిత్రా లోకేష్ తో సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం బెంగళూరులో వారిపై రమ్యా రఘుపతి దాడికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ఆ తర్వాత తరచూ వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నరేష్.. రమ్యా రఘుపతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన మూడో భార్య రమ్యా రఘుపతి ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు నరేష్ ఇంటి వద్ద దాడి జరగడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
నరేష్ , పవిత్రా లోకేష్ కొన్నాళ్లు మీడియాలో హాట్ న్యూస్ మారారు. కొన్నాళ్లుగా ఏ కార్యక్రమానికైనా ఇద్దరు కలిసే వెళుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి ఎంట్రీ అయ్యారు. ఈ జంటను బెంగళూరులో వెంబడించారు. చెప్పుతో దాడికి ప్రయత్నించారు. అప్పటి నుంచి వివాదం మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా నరేష్ ఇంటిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది.
Heart attack: గుండెపోటు దడ.. 18 నెలలు.. ఏడుగురు సెలబ్రెటీల మృతి