Mathura Meenakshi : అయిదు శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది. చేపల లాంటి చక్కని విశాలనేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడింది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకత మణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత. మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు.
మధుర మీనాక్షి అమ్మవారి చేతిలోని చిలుక జీవునికి, జీవుని ప్రాణానికి లేక మనస్సుకు ప్రతీక.అలాగే ఆమెకు మీనాక్షి లాంటి కళ్లు అంటే చేపల వంటి కళ్ల ని పేరు ఉంది. ఆ పేరు వెనక ఒక రహస్యం ఉంది.చేపలు గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే వాటి నుంచి వచ్చే పిల్లలు వెంటనే ఆకలితో అలమటిస్తాయి.అయితే చేపకు స్థనాలు ఉండవు కాబట్టి.
వాటికి పాలివ్వలేదు.అయి ఆ చిట్టి చేప పిల్లల ఆకలి తీర్చేందుకు తల్లి చేప వాటి కళ్లు విప్పి చూస్తుంటుంది.ఆ చూపుతో వాటి కడుపు నిండుతుంది. అలాగే మధుర మీనాక్షి కూడా చూపులతో భక్తుల్ని రక్షిస్తుంది. కేవలం కంటి చూపుతోనే తనను నమ్మినోళ్లను కాపాడుతుంది
అదే విధంగా విష్ణువు చేతిలోని చక్రం మన మనస్సే. .ప్రపంచం అంతా తిరిగి వస్తుంది. ఆయన చేతిలోని గద మన బుద్ధి. గదకు ప్రతి దానిని చితగ్గొట్టే గుణం ఉన్నట్లే. మన బుద్ధికి ప్రతీ విషయాన్ని తక్తంలో విశ్లేషించే గుణం ఉంటుంది. దాన్ని భగవత్తర్పం చేస్తే… భగవదర్పిత బుద్ధిగా మారుతుంది.
Follow this link for more updates:- Bigtv