Big Stories

Malika Rajyog: మాలిక రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు !

Malika Rajyog: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జూన్ 19వ తేదీ వరకు బుధుడు మిథున రాశిలో సంచరిస్తాడు. జూన్ 15న మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. దీంతో మిథునంలో బుధాదిత్య రాజయోగం సహా మరికొన్ని యోగాలు ఏర్పడ్డాయి. ఒకే వరుసలో ఏవైనా మూడు గ్రహాలు ఉంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం మాలిక రాజయోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం మిథున రాశిలో సూర్యుడు, శుక్రుడు, బుధుడు ఉన్నారు. అందుకే మాలిక రాజయోగం ఏర్పడింది.

- Advertisement -

గ్రహాలు వరుసగా ఏడు స్థానాల్లో ఉండి మాలగా కనిపించినప్పుడు ఇది మాలిక రాజయోగాన్ని సూచిస్తుంది. మాల నేపథ్యంలో నుంచి మాలిక రాజయోగం ఉద్భవించింది. మాలిక రాజయోగం చాలా శక్తివంతమైంది. దీని వల్ల కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మేషరాశి: ఈ రాశి వారికి మాలిక రాజయోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. మాలిక రాజయోగం సమయం వీరికి శుభదాయకంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తే ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. ఉన్నత విద్య అభ్యసించే వారికి కూడా కలిసి వస్తుంది. వ్యక్తిగత జీవితంపై సానుకూల ప్రభావం ఉంటుంది.

Also Read: నెల రోజుల పాటు ఈ రాశుల వారికి తిరుగు లేదు.. ఏం కోరుకున్నా ఇట్టే తీరిపోతాయ్

మిథున రాశి: మాలిక రాజయోగ కాలంలో మిథున రాశి వారికి గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు ఉంటే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
సింహ రాశి: ఈ రాశి వారి కుటుంబ జీవితం మాలిక రాజయోగం సమయంలో మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో వీరు సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ఆఫీసులో పనికి ప్రశంసలు అందుతాయి. కుటుంబం సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News