Lord Sri krishna:- సాధారణంగా దేవుడికి నైవేద్యం అంటే అప్పుడే వండిన శాకాహార ఆహారపదార్థాలు మాత్రమే పెడతారు. ఉత్తర భారత దేశంలో ఎక్కువ ఆహార పదార్థాలని తయారు చేసి కృష్ణుడికి నైవేద్యంగా అర్పిస్తారు. పాయసాన్ని శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమి సందర్భంగా నైవేద్యం పెడతారు. యాలుకల పొడి, డ్రై ఫ్రూట్స్, సేమ్యా లేదా బియ్యం తో ఈ పాయసాన్ని తయారు చేస్తారు.చాలా మంది అటుకులు, బెల్లం కలిపి నైవేద్యం పెడుతూ ఉంటారు . పంచదార పాకంలో అటుకులు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి కూడా చేసుకోవచ్చు. .
బియ్యం పిండితో బెల్లంతో ఈ రెసిపీ తయారు చేస్తారు. ఇది కూడా మంచి స్వీట్ రెసిపీ. దీనిని కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యం పెట్టచ్చు. తాజాగా తయారు చేసిన వెన్నెలో కొద్దిగా పంచదార వేసి శ్రీకృష్ణుడు కి నైవేద్యం పెడతారు.తాజా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తులసి ఆకులు మరియు వెన్నని కలిపి దేవుడికి అర్పిస్తారు ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు శ్రీకృష్ణుడికి ఆహార పదార్థాలు చేసి నైవేద్యం పెడతారు. వీటిని కూడా తప్పక నైవేద్యం పెడతారు.
Follow this link for more updates:- Bigtv