Big Stories

Jupiter-Mars Conjunction: 12 ఏళ్ల తర్వాత కుజుడు, గురు గ్రహాల కలయిక.. ఈ 3 రాశుల వారికి ధనలాభం

Jupiter-Mars Conjunction: కుజుడు, గురు గ్రహాల కలయిక 12ఏళ్ల తర్వాత వృషభ రాశిలో జరగనుంది. ఈ కలయిక ఫలితంగా కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు అందుతాయి. ఈ ఏడాదిలో జూలై చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే జూలై నెలలో కుజుడు, బృహస్పతి గ్రహాల కలయిక ఏర్పడనుంది.

- Advertisement -

కుజుడు, బృహస్పతి గ్రహాల కలయిక వల్ల 3 రాశుల వారు శుభ ఫలితాలు పొందుతారు. కుజుడు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. బృహస్పతి ఈ ఏడాదంతా వృషభ రాశిలో ఉంటాడు. జూలై 12వ తేదీ 2024 రాత్రి 7.12 గంటలకు మేషరాశిలో ఉన్న కుజుడు, బృహస్పతికి దగ్గరగా వస్తాడు. సుమారు 12 సంవత్సరాల తర్వాత కుజుడు, బృహస్పతి గ్రహాల కలయిక ఏర్పడుతోంది.

- Advertisement -

వృషభరాశిలో కుజుడు, గురు గ్రహాల కలయిక వల్ల 3 రాశుల వారి ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో అద్భుత ఫలితాలు ఉంటాయి. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
కుజుడు, గురు గ్రహాల కలయిక వల్ల వృషభరాశి వారు అద్భుత ప్రయోజనాలు పొందుతాయి. నష్టపోయిన డబ్బు తిరిగి పొందుతారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా సామాజిక హోదా,ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. అకస్మాత్తుగా డబ్బు సంపాదించే అవకాశాలున్నాయి.
సింహ రాశి:
గురు గ్రహానికి దగ్గరగా కుజుడు రావడం వల్ల సింహా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరి అభివృద్ధి కోసం అనేక అవకాశాలు పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులు కూడా విజయవంతం అవుతాయి. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో అదృష్టం కలసి వస్తుంది.
వృశ్చిక రాశి:
గురు, కుజుడి కలయిక వల్ల వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News