Japam:జపం కూడా చేసే విధానాన్ని బట్టి దాని పలితాన్ని ఇస్తుంది. అందరికీ అనుకూలమైన ప్రాంతం ఇల్లు. ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితాన్ని ఇస్తుంది. ఇక భారతీయ సాంప్రదాయంలో నదులు ఒక భాగం. వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు భారతీయులు. అలాంటి నదిలో చేసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. దేవతా స్వరూపంగా చూసే జంతువులలో ఆవు ఎంతో గొప్పది. అలాంటి ఆవుల నిలయమైన గోశాలలో జపం వందరెట్లు పలితాన్ని ఇస్తుంది. యాగశాలలో చేసే జపం అంతకుమించి ఫలితాన్నిస్తుంది .
కొయ్యపీటపై కూర్చుని జపం చేస్తే దౌర్భాగ్యము కలుగుతుంది. గడ్డితో చేసిన చాపపై కుర్చీని జపం చేస్తే చిత్తచాపల్యము కలుగుతాయి. అంటే మనసు నిలకడగా ఉండదు. జింక చర్మము పై కూర్చుని చేస్తే జ్ఞానసిద్ధి కలుగుతుంది. చాలామంది యోగులు, సన్యాసులు దీనిపైనే జపం చేస్తారు. పులి తోలుపై కూర్చుని జపం చేస్తే మోక్షము సిద్ధిస్తుంది. ఎంతో గొప్ప మహర్షులు పులిచర్మం పై జపం చేస్తారు.వస్త్రాన్నీ పరచుకుని దానిమీద కూర్చుని జపం చేస్తే డబ్బు సమకూరి ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి
దేవుళ్ళు స్వయంభువు గానూ, ప్రతిష్టగానూ కొలువై ఉన్న పుణ్యతీర్ధాలలోను, దేవతాసన్నిధిలోనూ చేస్తే పదివేలకోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అన్నింటికీ మించి ఆ పరమేశ్వరుడి సన్నిధి అంటే శివాలయంలో జపం చెస్తే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే జపాన్ని కూడా వివిధ రకాలుగా అంటే వివిధ అసనాలలో చేయడం వల్ల కూడా ఫలితాలు వేరుగా ఉంటాయి.
వెదురు తడకపై కూర్చుని చేస్తే దారిద్ర్యము సంభవిష్తుంది కాబట్టి ఎప్పుడూ ఇలా చేయకూడదు. రాతిపై కూర్చుని చేస్తే రోగాలు వస్తాయని అంటారు. అందుకే రాతిమీద కూర్చుని చేయకూడదు. నేలపై కూర్చుని చేస్తే దుఃఖము కలుగుతుంది. దుఃఖాలు పొగొట్టుకొవడానికి -కంబళి పైన కూర్చుని జపం చేయాలి. అలాగే దర్భలతో చేసిన ఆసనంపై కూర్చుని జపము చేసినా పుష్టిని కలిగిస్తుంది.