Big Stories

JC Prabhakar Reddy: న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులతో నిరసన దీక్ష: జేసీ ప్రభాకర్ రెడ్డి

JC Prabhakar Reddy: వైసీపీ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని తాడిపత్రి మున్సిపల్ చేర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. బస్సుల కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం తమను దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపించిందని ఆరోపించారు. పది రోజుల్లో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎస్పీ కార్యాలయం, డీసీపీ ఆఫీస్ ఎదుట తన కుటుంబ సభ్యుతో కలిసి నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.

- Advertisement -

జేసీ ట్రావెల్స్‌పై తప్పుడు కేసులు పెటారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ ట్రావెల్స్‌పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయంపై పది రోజుల్లో న్యాయం జరగాలని అన్నారు. తప్పు చేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగల మాదిరిగా అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేశారని ఆరోపించారు.

- Advertisement -

Also Read: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన ఖరారు

2017 ఏప్రిల్1 తర్వాత బీఎస్ 4 వాహనాలు అమ్మకూడదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని పలు రాష్ట్రాల్లో హైకోర్టులు తీర్పు ఇచ్చారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఏపీని చెడ గొట్టింది ఐఏఎస్, ఐపీఎస్ లేనని ఆరోపించారు. రవాణా శాఖ అధికారులు అంతా అవినీతి పరులే అని అన్నారు. తన బస్సులను అన్నింటినీ ట్రాన్స్ పోర్టు అధికారులు రిపేర్ చేయించి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన పరువు తీసి బయట తిరగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News