Big Stories

TDP Office attack case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. పోలీసుల విచారణ, త్వరలో అరెస్టులు!

TDP Office attack case: ఏపీ పోలీసులు రంగంలోకి దిగేశారు. దాదాపు మూడేళ్ల కిందట మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయానికి వచ్చారు. దాడి జరిగిన సమయంలో ఆఫీసులోని ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించారు. కొంత ఫుటేజ్‌ని తమతో అధికారులు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై కీలక నిందితులుగా భావిస్తున్నవారిని రెండు రోజుల్లో అరెస్టు చేేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

2021 అక్టోబరు 19న వైసీపీకి చెందిన దాదాపు 200 మంది అల్లరి మూకలు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారు. ఈ ఘటనలో కార్లు, ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్ డ్యామేజ్ అయ్యింది. టీడీపీ ఆఫీసు వద్ద కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా సరే రాడ్లతో దాడికి పాల్పడ్డారు. దీనిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ దాడి వెనుక వైసీపీకి చెందిన దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

- Advertisement -

Also Read: ఏపీలో మళ్లీ ఉద్రిక్తత.. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మహిళా నేత మృతి!

దాడికి కారణమైన వైసీపీ కార్యకార్తలను పోలీసులు గురించారు. రేపోమాపో వాళ్లని అరెస్టు చేసి అసలు విషయాలను రాబట్టాలని భావిస్తున్నారు. ఇప్పుడు నిందితులను గుర్తించే పనిలోపడ్డారు. దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై పోలీసులు అంతర్గతంగా విచారణ చేయిస్తున్నారు. మొత్తానికి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టిన తొలి కేసు ఇదే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News