E-Paper
Advertisement

Nara Lokesh: ఢీ అంటే ఢీ అంటేనే పదవులు.. పులివెందులపై లోకేశ్ ఫోకస్..

Nara Lokesh: ఢీ అంటే ఢీ అంటేనే పదవులు.. పులివెందులపై లోకేశ్ ఫోకస్..
nara lokesh

Nara Lokesh latest news(Political news in AP): 90వేల మెజారిటీతో గెలిపించినందుకు పులివెందులకు సీఎం జగన్ చేసింది ఏంటి? వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు రావడం తప్ప పులివెందుల నియోజకవర్గానికి జగన్ ఏం చేశారు? అంటూ నిలదీశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. పులివెందులకు నీళ్లు ఇచ్చింది.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది.. తామేనన్నారు.

పులివెందులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేశ్ సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి పీడిస్తున్నారని.. పులివెందుల ప్రజలు కూడా అందుకు బాధితులే అని విమర్శించారు. పులివెందులలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని.. స్కూళ్లలో కనీస వసతులు లేవని.. అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని మండిపడ్డారు.

పులివెందుల టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు లోకేశ్. పనిచేసే వారికే పదవులు ఇస్తామని.. కేసులకు భయపడి ఇంట్లోనే అంటే కుదరదని తేల్చి చెప్పారు. ఢీ అంటే ఢీ అనే వాళ్లనే గుర్తించి పార్టీ పదవులు కట్టబెడతామని అన్నారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి.. సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు నారా లోకేశ్.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×