Big Stories

Minister Durgesh: ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రండి: మంత్రి కందుల దుర్గేష్

Minister Kandula Durgesh: ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను కోరారు. గురువారం సచివాలయంలోని రెండో బ్లాక్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

- Advertisement -

కోనసీమలో మూవీ షూటింగ్స్ పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. పర్యాటక రంగం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. అధికారిక యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామని అన్నారు.

- Advertisement -

Also Read: జనంలోకి జగన్.. ఓదార్పు యాత్రకు రెడీ ?

పర్యాటక ప్రాంతాలుగా ఉండాల్సిన ప్రాంతాలను వైసీపీ ప్రభత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అదృష్టవశాత్తు ప్రజలు వైసీపీకి బుద్ది చెప్పారని అన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకుని నిధులు సమకూర్చుకుని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏపీలో స్టూడియో నిర్మాణం కోసం ముందుకు రావాలని ఆహ్వానం పలికారు. గత పాలకులకు చిత్తశుద్ది ఉంటే కేరళ తరహాలో కోనసీమను అభివృద్ధి చేసేవారని చెప్పారు. రూ. 2 కోట్ల 31 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న బోట్ షికార్ ఫైల్‌పై మంత్రి మొదటి సంతకం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News