E-Paper
Advertisement

Tirumala: ఆ చిరుత చిక్కింది.. ఇంకోటి దాగుంది.. తిరుమల ఘాట్‌రోడ్ సేఫేనా?

Tirumala: ఆ చిరుత చిక్కింది.. ఇంకోటి దాగుంది.. తిరుమల ఘాట్‌రోడ్ సేఫేనా?
Advertisement
LEOPARD caught

Cheetah attack in tirumala(AP latest news): తిరుమలలో బాలుడిపై దాడి చేసిన చిరుతను అధికారులు బోనులో బంధించారు. చిరుత ఆచూకీ కోసం 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని టీటీడీ DFO శ్రీనివాసులు అన్నారు. చిరుత అడుగుల సాయంతో.. ఎక్కువగా ఏ ప్రాంతాల్లో తిరుగుతుందో గుర్తించి.. 2 బోనులు ఏర్పాటు చేశామని చెప్పారు. దీంతో.. శుక్రవారం రాత్రి చిరుత బోనులో చిక్కిందని టీటీడీ DFO శ్రీనివాసులు తెలిపారు.

చిరుతలు మనుషులపై దాడి చేయవని టీడీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఓ పిల్లిని దాడి చేసే క్రమంలో బాలుడిపై దాడి చేసిందని తెలిపారు. చిరుతను పట్టుకునే క్రమంలో.. దాని తల్లి జాడ కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు.

Advertisement

గురువారం రాత్రి అలిపిరి నడకమార్గంలో.. బాలుడిపై చిరుత దాడి చేసి గాయపర్చింది. చిరుత నోట చిక్కిన బాలుడు అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిని లాక్కుని అడవిలోకి పరుగులు తీసింది ఆ చిరుత. ఒక్కసారిగా ఉలిక్కిపడిన బాలుడి తల్లిదండ్రులు.. అక్కడే ఉన్న పోలీసులు, భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత బాలుడిని వదిలేసి పారిపోయింది. బాలుడికి తీవ్రగాయాలైనప్పటికీ బతికి బట్టకట్టాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్నాడు.

చిరుత దాడితో నడకదారిలో భక్తుల భద్రతపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అదే ప్రాంతంలో ఇంకా మూడు చిరుతలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు, టీటీడీ కొత్త రూల్స్ తెచ్చింది. సాయంత్రం తర్వాత భక్తులు ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని.. సెక్యూరిటీ గార్డ్ తోడుగా 200 మందిని ఓ గుంపుగా మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×