E-Paper
Advertisement

Tirumala : అలిపిరి నడకమార్గంలో బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Tirumala : అలిపిరి నడకమార్గంలో బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత .. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Advertisement

Chirutha attack in tirumala(Latest news in Andhra Pradesh): గురువారం రాత్రి 9.10 గంటలు సమయం. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ కుటుంబం కాలి నడక తిరుమల వెళుతోంది. ఆ సమయంలో 4 ఏళ్ల బాలుడి కౌశిక్ తాతతో కలిసి షాపు వద్ద చిప్స్ ప్యాకెట్ కొనుకుంటున్నాడు. ఇంతలోనే భయానక ఘటన జరిగింది. ఒక్కసారిగా చిరుత దూసుకొచ్చింది. ఆ బాలుడిని మెడ పట్టుకుని అడివిలోకి లాక్కెల్లింది. క్షణాల్లోనే తేరుకున్న బాలుడి తాత అరుస్తూ చిరుత వెంట పరుగెత్తాడు. పోలీసులు వేగంగా స్పందించారు. కొందరు భక్తులు, స్థానిక దుకాణదారులు అడవిలోకి చిరుత వెంట పరుగులు తీశారు. టార్చ్‌లైట్లు వేసి రాళ్లు విసురుతూ కేకలు వేశారు. దీంతో చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్లిపోయింది.

Advertisement

అలిపిరి నడక దారిలోని ఏడు మైలురాయి దగ్గర ఈ ఘటన జరిగింది. భద్రతా సిబ్బంది, భక్తులు, స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించారు. అందువల్లే ఆ పసివాడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడికి చెవి వెనుక, తలపై గాయాలయ్యాయి.వెంటనే ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత తిరుపతి పద్మావతి హృదయాల ఆస్పత్రికి తరలించారు. కౌశిక్ కు సిటీ స్కాన్ చేశారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ పసివాడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

తిరుమల నడకమార్గంలో ఇలా చిరుత వచ్చి బాలుడిపై దాడి చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం వేల మంది భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళతారు. క్రూర జంతువులు వారిపై దాడి చేసే అవకాశాలున్నాయి. తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×