CM Chandrababu Naidu Visits Amaravati : పోలవరం తర్వాత అమరావతిపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగానే రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్యంసాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ముందుగా.. కూల్చిన ప్రజావేదిక ప్రాంగణాన్ని వీక్షించారు. చంద్రబాబునాయుడు ఆ ప్రాంతానికి వెళ్లగానే.. జై చంద్రబాబు, జై అమరావతి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. జగన్ ప్రభుత్వ విధ్యంస పాలనకు సాక్షిగా ఈ శిథిలాలను అలాగే ఉంచుతామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.
తర్వాత ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో మోకాళ్లపై కూర్చొని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి నమస్కరించారు. అక్కడి నుంచి హోమం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.
Also Read : జగన్ పథకాలకు పేర్లు మార్పు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
మహిళా రైతులు ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. హారతులతో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఫౌండేషన్ స్టోన్కు కొబ్బరి కాయ కొట్టారు చంద్రబాబు. ఆ తర్వాత అమరావతి నమూనాను పరిశీలించారు. రైతులతో కాసేపు ముచ్చటించారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల నివాస భవనాల నిర్మాణాలను పరిశీలించారు. 2019లోనే ఈ భవనాల నిర్మాణం 70 నుంచి 90 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రాగానే.. అమరావతి అటకెక్కింది. నిర్మాణ పనులను నిలిపివేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్లక్ష్యం చేశారని సీఎం చంద్రబాబునాయుడు స్థానికులతో అన్నారు.
అమరావతిలోని రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రదేశానికి నమస్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు.
Follow @bigtvtelugu for more updates#AndhraPradesh #APnews #Tdp #ChandrababuNaidu #Amaravati #Newsupdates #bigtvlive @JaiTDP @ncbn pic.twitter.com/BLbbVLGwnE
— BIG TV Breaking News (@bigtvtelugu) June 20, 2024