BigTV English
Advertisement

Viveka Murder Case: అవినాష్ నిందితుడే.. జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ కౌంటర్..

Viveka Murder Case: అవినాష్ నిందితుడే.. జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ కౌంటర్..
avinash jagan viveka

Avinash Reddy Latest News(AP breaking news today): ముందస్తు బెయిల్ వచ్చిన సంతోషం అవినాష్‌రెడ్డికి లేకుండా చేస్తోంది సీబీఐ. అరెస్ట్ నుంచి తప్పించుకున్నా.. కేసు ఉచ్చు నుంచి అంత ఈజీగా బయటపడే పరిస్థితి లేదు. ఇన్నాళ్లూ అవినాష్‌ను సహానిందితుడు, సాక్షిగా చెప్పిన సీబీఐ.. లేటెస్ట్‌గా హైకోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో ఏకంగా ఏ8 నిందితుడిగా చేర్చడం కలకలం రేపుతోంది. ఇదే కౌంటర్‌లో మరోసారి సీఎం జగన్ ప్రస్తావన కూడా తీసుకురావడం పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.


వివేకా మర్డర్ కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి వేసిన బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే, భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ జూన్ 5న సీబీఐ ఫైల్ చేసిన కౌంటర్‌లో అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది.

వివేకా హత్యకు కుట్ర చేయడం, సాక్ష్యాలను చెరిపి వేయడంలో.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిల ప్రమేయం ఉందని.. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసేందుకు వారిద్దరు ప్రయత్నిస్తున్నారని చెప్పింది.


వివేకా మర్డర్ గురించి సీఎం జగన్‌కు ఉదయం 6.15కంటే ముందే తెలుసని సీబీఐ తన కౌంటర్లో ప్రస్తావించింది. హత్య గురించి మొదట చెప్పారని అంటున్న వివేకా పీఏ కంటే ముందే.. జగన్‌కు ఆ విషయం తెలుసని తమ దర్యాప్తులో గుర్తించామని సీబీఐ స్పష్టం చేసింది.

భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తారని.. అతన్ని అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ర్యాలీలే భాస్కర్‌రెడ్డి బలానికి నిదర్శనమని సీబీఐ తెలిపింది.

శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యా స్థలానికి చేరుకున్నారని.. ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో.. గంగిరెడ్డి మాట్లాడారని సీబీఐ తన కౌంటర్లో ప్రస్తావించింది.

Related News

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Big Stories

×