Big Stories

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కమిషన్ పేర్కొంది.

- Advertisement -

ఫిబ్రవరి 25న గ్రూప్స్-2 ప్రిలిమ్స్ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాగా ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసింది. ముందుగా జులై 28న మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వం మారడం.. పరిపాలనా కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

- Advertisement -

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News