Big Stories

AP Legislative Council Election: ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. రేపే నామినేషన్

AP Legislative Council Elections(Political news in AP): ఏపీలో ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ నేత సి. రామచంద్రయ్య, జనసేన నేత పిడుగు హరిప్రసాద్ పేర్లను ఏపీ అధికార కూటమి ఖరారు చేసింది. ఈ ఇరువురు నేతలు మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు కూటమి తెలిపింది.

- Advertisement -

కాగా, హరిప్రసాద్ పవన్ కల్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా ఆయనకు పలు మీడియా సంస్థలలో పని చేసిన అనుభవం ఉంది.

- Advertisement -

Also Read: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. చంద్రబాబు సీరియస్

ఇటు సి. రామచంద్రయ్య టీడీపీలో సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నారు. మంత్రిగా, ఎంపీగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగానూ రామచంద్రయ్య పని చేశారు. ఆ తరువాత చిరంజీవి ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. 2018లో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, 2023 డిసెంబర్ లో వైసీపీకి గుడ్ బై చెప్పి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News