Big Stories

AP High Court Orders Status Quo: అప్పటి వరకూ ఆపండి.. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో..

AP High Court Status Quo on Demolition: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతలపై హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటివరకు స్టేటస్ కో విధిస్తూ న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ కార్యాలయాలను రేపటి వరకు యథాతథంగా ఉంచాలంటూ ఆ ఆదేశాలలో పేర్కొంది. పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ ను దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే.. ఏపీలో మొత్తం 10 జిల్లాల వైసీపీ కార్యాలయాలకు సంబంధించి పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీ చేసింది. దీనిపై హైకోర్టు రేపు మరోసారి విచారణ జరపనుంది.

- Advertisement -

Also Read: జగన్ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గు చేటు: ఎమ్మెల్యే మాధవి

- Advertisement -

ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీలో అనేక చోట్ల వైసీపీ కార్యాలయాలను అక్రమంగా నిర్మిస్తున్నారంటూ ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు కూల్చివేయడం చర్చనీయాంశమైంది. ఆ తరువాత వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసులకు సైతం అక్కడి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయా ఆఫీసులను సైతం కూల్చివేస్తారా..? అన్న అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి న్యాయస్థానం నిర్ణయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News