AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమరావతి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన వెలగపూడిలోని సచివాలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం తరువాత ఆయన సచివాలయానికి వెళ్లడం ఇదే తొలిసారి. సచివాలయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించారు.
అటు సచివాలయంలో పవన్ కల్యాణ్కు ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సీఎం సాదరంగా ఆహ్వానం పలికారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఆలింగనం… pic.twitter.com/Yt0iv7PQ8Q
— JanaSena Party (@JanaSenaParty) June 18, 2024
అంతకుముందు అమరావతి రైతులు పవన్ కల్యాణ్కు ఘనస్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఆయనకు రాజధాని రైతులు భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం వెంకటపాలెం నుంచి మందడం వరకు పవన్ కల్యాణ్ ర్యాలీ కొనసాగింది. పవన్ కల్యాణ్ ర్యాలీ తీసినంత సేపు ప్రజలు నీరాజనాలు పలికారు. ఆయనపై పూల వర్షం కురిపించారు.
అమరావతిలో రాజధాని రైతుల అపూర్వ స్వాగతం
దారి పొడవునా పూల వర్షంతో నీరాజనం
సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గంటన్నరపాటు సమావేశం pic.twitter.com/Q58UCKJStB
— JanaSena Party (@JanaSenaParty) June 18, 2024