AP Deputy CM Pawan Kalyan Banners Infront of Roja’s Home:ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎప్పుడూ లేని విధంగా కూటమి ఘన విజయం సాధించింది. ఫాన్ పార్టీకి దిమ్మతిరిగే ఓటమి పాలవడంతో వైసీపీ నేతలు తలమునకలు అయ్యేలా ఆలోచన్లో ఉన్నారు. మొత్తానికి గత ఐదేళ్లు ప్రత్యర్ధి నేతలను ఒక ఆడుకుంది రోజా.. కానీ వైసీపీ భారీ ఓటమితో పూర్తిగా సీన్ రివర్స్ అయింది.
నగరిలో ఆమె తిరిగే పరిస్థితి కూడా కనిపించండం లేదు. అక్కడ ఉన్న రోజా పెయిడ్ గ్యాంగు అదే భయంతో ఎవరిదారి వాళ్లు చూసుకున్నారంట. ఇక ప్రజలు, పార్టీ నేతలు అందరు కలిసి ఒంటరిని చేశారు. ఈ నేపథ్యంలో నగరిలో రోజాకి మరో భారీ షాక్ తగిలింది. ఆమె ఇంటి ఎదురుగా జనసేన కార్యకర్తలు పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
Also Read: వైసీసీ హయాంలో భారీ కుంభకోణం.. పౌరసరఫరా శాఖలో రూ.200కోట్ల దోపిడి
గతంలో తన నియోజవర్గంలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించాలన్న ఆమె పర్మిషన్ తీసుకోవాల్సిందే. వైసీసీ ఎమ్మెల్యే, మంత్రులు ఫ్లెక్సీలు కట్టాలన్నా.. చివరికి జగన్ బ్యానర్ కట్టాలన్నా.. రోజా అనుమతి ఉండాలి. లేదంటే.. ఫ్లెక్సీల ఏర్పాటు జరగనట్టే. కానీ.. అధికార మార్పిడి జరిగిన తర్వాత రోజా సైలంట్ అయిపోయారు. ఏకంగా ఆమె ఇంటి ఎదుట పవన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.