Big Stories

Chandrababu Meeting with Modi : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ

CM Chandrababu Meeting with Modi(Andhra politics news): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. ఆయన నేడు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. 45 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీకి కేంద్రం నుంచి అందించే ఆర్థిక సహాయంతో పాటు.. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత తదితర అంశాలపై చర్చించారు.

- Advertisement -

ప్రధానితో భేటీకంటే ముందు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. సుమారు అరగంటపాటు ఇరువురు వివిధ అంశాలపై చర్చించారు. కాగా.. మధ్యాహ్నం కేంద్రమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లతో పాటు నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ లతోనూ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News