Big Stories

AP Assembly: అసెంబ్లీ చేరుకున్న చంద్రబాబు.. ఛాంబర్‌లో భావోద్వేగం

AP CM Chandrababu in Assembly: ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చారు. అసెంబ్లీ మెట్లకు నమస్కారం చేసి శాసన సభలో చంద్రబాబు అడుగుపెట్టారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో కూర్చున్న తర్వాత చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. కాగా,  సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని చంద్రబాబు 2021లో శపథం చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. కాగా, సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News