Hyderabad latest news(Telangana news live): ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. బాలికలు లైంగికల దాడులకు గురవుతున్నారు. కామోన్మాదులు చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో అమానుష ఘటన జరిగింది.
హయత్ నగర్ లో ఓ మైనర్ బాలికను కొందరు యువకులు కిడ్నాప్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోకి తీసుకెళ్లారు. అక్కడ బాధితురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆ యువకుల నుంచి అతికష్టంమీద బాలిక తప్పించుకుంది. రోడ్డుపైకి పరుగెత్తికొచ్చింది. గట్టగా ఏడుస్తూ సాయం కోసం ఎదురుచూసింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను గుర్తించింది. బాధితురాలిని ఆ యువకుల బారి నుంచి రక్షించింది. ఆ హిజ్రా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
యువకులను ప్రతిఘటించే సమయంలో మైనర్ బాలికకు గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.