Bandi Sanjay news today(Political news in telangana) : కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వంద కోట్లు యాడ్స్ ఇచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణల ఆధారంగా విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలని కోరారు. కరీంనగర్ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోహన్ సింగ్ కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు.
సోమవారం ఢిల్లీలో బండి సంజయ్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో పుస్తెలు అమ్మిన బండి సంజయ్ కు ఇప్పుడు వంద కోట్ల యాడ్స్ ఇచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని సీఆర్పీసీ 161 కింద కేసు నమోదు చేయాలని కోరారు. అయితే బండి సంజయ్ పదవికి రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.