Congress party meeting in khammam(Telangana politics): ఖమ్మం సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు భద్రతా వైఫల్యం కలకలం రేపింది. పోలీసులు సరైన భద్రత కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్. వేదిక దగ్గర కొందరు నానా హంగామా చేశారు. సభా వేదిక వైపు ఒక్కసారిగా దూసుకొచ్చారు. వారిని కంట్రోల్ చేయడానికి సరిపడా బలగాలు లేరు. దాంతో చాలాసేపు గందరగోళ పరిస్థితి చోటు చేసుంది.
రాహుల్ ప్రసంగం అయిపోయే వరకు ఎప్పుడు ఏం జరుగుతుందనే పరిస్థితి చోటు చేసుకుంది. స్టేజ్ దగ్గరకు వచ్చిన పార్టీ శ్రేణులు.. పీఎం..పీఎం అంటూ నినాదాలు చేశారు. రాహుల్ కూడా ఒకాన సందర్భంలో వారించారు. ప్లీజ్ అంటూ సర్ధిచెప్పారు. ఇక పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా లేచి… కూర్చోవాలంటూ..కార్యకర్తలకు సూచించారు.
రాహుల్ సభకు సరైన భద్రత కల్పించలేదా? ఎందుకు గందరగోళం చోటు చేసుకుంది? ఇప్పుడే ఇదే చర్చనీయాంశంగా మారింది. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ప్రధాని కుమారుడు.. అలాంటి నేత భద్రతా విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. రాహుల్ గాంధీ సభకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మొదటి నుంచి కాంగ్రెస్ సభకు ఆటంకాలు సృష్టించారనే ఆరోపణలు ఎందుర్కొంది ప్రభుత్వం. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రోదల్భంతో అధికారులు.. అడుగడుగునా.. ఇబ్బందులు పెట్టారని ఆరోపిస్తోంది హస్తం పార్టీ.