Congress meeting in khammam(Latest political news telangana): ఖమ్మం కాంగ్రెస్ జనగర్జనలో సంచలన హామీ ప్రకటించారు రాహుల్ గాంధీ. గతంలో వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్ ప్రకటించినట్టుగానే.. ఖమ్మంలో ‘చేయూత’ పథకాన్ని అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు, వితంతులకు, నిరుపేతలకు నెలకు 4వేలు పెన్షన్ ఇస్తామంటూ ప్రకటించారు రాహుల్.
ఆ మేరకు కర్నాటక ఎన్నికల మాదిరిగానే.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు ప్రదర్శించారు.
ప్రస్తుతం తెలంగాణలో నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పెన్షన్ను ఏకంగా డబుల్ చేసి.. నెలకు 4వేలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ హామీపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్కు పెద్ద ఎత్తున ఊపు తీసుకొచ్చే పథకం ఇదని రాజకీయ పండితులు అంటున్నారు.