Durgam Chinnaiah Sejal news(Latest news in telangana): బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్.. మంత్రి కేటీఆర్ పై ఫైరయ్యారు. శేజల్ గురించి మీడియా ఎదుట ప్రస్తావించిన మంత్రి కేటీఆర్.. తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవనడాన్ని ఆమె తప్పుపట్టారు. తన విషయంలో మంత్రి కేటీఆర్ ప్రత్యక్ష సాక్షిలాగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను శేజల్ విడుదల చేశారు.
తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్ మెంట్ కోసం ముందు నుంచి ప్రయత్నించినట్లు శేజల్ తెలిపారు. అయితే నిజానిజాలు తెలుసుకోకుండానే మంత్రి కేటీఆర్.. తన ఆరోపణలను తప్పుపట్టడాన్ని ఆమె ఖండించారు. తన పార్టీని కాపాడుకోవడానికే మంత్రి కేటీఆర్.. అలా మాట్లాడారని తాననుకుంటున్నట్లు శేజల్ తెలిపారు.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చర్యలపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని శేజల్ డిమాండ్ చేశారు. విచారణలో వెల్లడైన నిజానిజాల ఆధారంగా దోషులను శిక్షించాలని ఆమె కోరారు. తాను తప్పు చేసినట్లు తేలితే.. ఎలాంటి శిక్షనైనా అనుభవించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు శేజల్ స్పష్టం చేశారు. విచారణ జరిపేందుదుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా..? అని ఆమె ప్రశ్నించారు.