BJP MLA Etela Rajender news(TS politics): మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందా? ఆయన భార్య ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. నాభర్త రాజేందర్ను చంపేందుకు కుట్ర జరుగుతోందని సూటిగా చెప్పారామె. ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి ఈ కుట్ర చేస్తున్నట్టు కూడా ఆరోపించారు. ఈటల రాజేందర్ హత్యకు 20కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి చెప్పినట్టు తనకు తెలిసిందన్నారు ఈటల జమున. సీఎం కేసీఆర్ అండదండలతోనే కౌశిక్రెడ్డి రెచ్చిపోతున్నారని కూడా ఆరోపించారు.