Hyderabad news today telugu(Latest news in telangana) :హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్లో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ ర్యాంప్ కూలడంతో పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రాంతం పగలు బాగా రద్దీగా ఉంటుంది. వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ప్రమాదం జరిగితే భారీగా ప్రాణ నష్టం సంభవించేది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్లైఓవర్ ర్యాంప్ మాత్రమే కూలిందని కాంట్రాక్టర్ చెబుతున్నారు. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడ్డారని సమాచారం. వారంతా బీహార్ వలస కార్మికులేనని తెలుస్తోంది.
ఎల్బీనగర్ బైరామల్ గూడలో ఫ్లైఓవర్ ర్యాంప్ కూలిపోయిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనపై దర్యాప్తు చేయిస్తామన్నారు. నిర్మాణలోపాలకు కారకులైన వారికి శిక్షపడేలా చేస్తామని స్పష్టం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.