MLA Rohit Reddy news(TS news updates): తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్లో బీర్ చిందిస్తూ ఎంజాయ్ చేశారాయన. యూత్కు ఆయన స్వయంగా మందు తాపించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
గతంలో రోహిత్రెడ్డి తమ్ముడు సైతం ఓ పబ్లో ఇలానే చెలరేగిపోయాడు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడి చేశాడు. తనపై దాడిని రాహుల్ తీవ్రంగా ఖండించాడు. మంత్రి కేటీఆర్ స్పందించాలని డిమాండ్ కూడా చేశాడు.
ఈసారి ఎమ్మెల్యే రోహిత్రెడ్డినే.. ఇలా పబ్లో మందేసి, చిందేసి.. విమర్శల పాలవుతున్నారు. ఫ్యామిలీకి ఫ్యామిలే పబ్బుల చుట్టూ తిరుగుతున్నారంటూ మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలని.. ఇలా పబ్లో తాగుతూ, తాగిస్తూ.. ఎమ్మెల్యే పదవికి ఉన్న విలువను తగ్గిస్తున్నారని నెటిజన్లు కామెంట్లతో ఫైర్ అవుతున్నారు.